Tuesday, March 6, 2007


"భద్రం భద్రం కృతం మౌనం కోకిలైర్జల దాగమే
దుర్దురా యత్ర వక్తార స్తత్ర మౌనం హి శోభనమ్"
కోకిల మధుమాసంలో తన మధురమైన కంఠాన్ని సవరించి 'కుహూ కుహూ' అంటూ కూస్తుంది.కానీ వానాకాలంలో మౌనంగా ఉంటుంది. వానకాలంలో కప్పలు అరుస్తాయి. ధుర్భరమైన ఆ కప్పల గొంతులు అరుస్తుంటే తన మధురమైన గొంతును వినిపించడం వలన ప్రయోజనం శూన్యం. దుర్మార్గులందరూ కలసి మూర్ఖంగా వాదిస్తున్నప్పుడు ఒక సజ్జనుడు మంచి మాటలు ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు. విలువ కాపడుకోవాలంటే మౌనమే శరణ్యం.

1 comment:

Unknown said...

good blog
www.youtube.com/channel/UCJMx6_3I6oTEC858UVMuyzg/videos
plz watch our channel.